రాజాసింగ్కు భద్రత పెంపు
ABN, Publish Date - Mar 20 , 2025 | 10:50 AM
Rajasingh Security Increase: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు వన్ ప్లస్ ఫోర్ భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

హైదరాబాద్, మార్చి 20: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు (BJP MLA rajasingah) భద్రత పెంచారు. ఇటీవల రాజాసింగ్కు బెదిరింపు కాల్స్ రావడంతో తనకు భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని (Telangana Govt) కోరడంతో రాజాసింగ్కు బులెట్ ప్రూఫ్ వాహనంతో పాటు వన్ ప్లస్ ఫోర్ (1+4) భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు గన్ లైసెన్స్ కూడా ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే కోరుతున్నారు. ఇటీవల గన్లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 20 , 2025 | 10:50 AM