Home » Raja Singh
Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
టెలీ కాలర్పై గోషా మహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజా సింగ్ మండిపడ్డారు. బైక్ కొనుగోలు కోసం లోన్ తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో బ్యాంక్ లోన్ చెల్లించాలంటూ ఎమ్మెల్యే రాజా సింగ్కు ఓ ప్రైవేట్ బ్యాంక్ తరఫున టెలీ కాలర్ ఫోన్ చేశారు.
హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో మత బోధకుడు మౌల్వీ సోహెల్ అబూబకర్ తిమోల్ (27)ను గుజరాత్లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు.
Telangana: నగరంలోని గౌలిగూడ మందిర్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అయితే శోభాయాత్రను పురస్కరించుకుని గౌలిగూడ రామ మందిర్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజసింగ్, మాజీమంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రాం మందిర్ ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారన్నారు.
శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంతోపాటు, వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh)పై అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నగరంలోని అప్జల్గంజ్ పోలీసు స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) పై గురువారం నాడు కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు రాజాసింగ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఆరోపించారు.
Telangana: ‘‘కొంతమంది మా బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారు.. జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్ ఇచ్చి.. మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది’’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు.
బీజేపీ నేత రాజాసింగ్(Rajasingh)ను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు(గురువారం) చెంగిచెర్ల వెళ్తానని రాజాసింగ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనకు.. రేవంత్ రెడ్డి పాలనకు పెద్దగా తేడా లేదని అన్నారు.
Telangana: ఎంపీగా పోటీపై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తోందని... కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు.