Minister Lokesh: రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించొద్దు.. ఇది కరెక్ట్ కాదు అధ్యక్షా

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:37 PM

ఏపీ శాసనమండలిలో వైసీపీ నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఏపీని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సభలో వైసీపీ సభ్యుల పద్ధతి సరిగా లేదని లోకేష్ చెప్పారు.

అమరావతి: ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఏపీని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. సభలో వైసీపీ సభ్యుల పద్ధతి సరిగా లేదని చెప్పారు. సభలో కుల, మతాలను తీసుకురావద్దని అన్నారు. కులాల మతాలకు తమ ప్రభుత్వం సమానమైన ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు. దేవుడుకు వైసీపీ నేతలు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో తెలుసునని మంత్రి నారా లోకేష్ అన్నారు.


పాఠశాలల హేతుబద్ధీకరణపై శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ.. వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. హిందూమతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారని రవీంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్‌ మార్పు చేశారనడం సరైంది కాదని చెప్పారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దని అన్నారు. తమ మాటలు తప్పుగా ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ వ్యాఖ్యలను తొలగించాలన్న బొత్స సత్యనారాయణ సూచనను మంత్రి లోకేష్‌ స్వాగతించారు. హిందీ తప్పని సరిగా నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని అన్నారు. మాతృభాషను ప్రోత్సహించాలని కేంద్రం తెలిపిందన్నారు. స్థానిక భాషతో పాటు హిందీ, ఇతర భాషలు నేర్చుకుంటే.. బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయమని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.


పూర్తి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Bayyavaram Incident: బయ్యవరం ఘటనపై చంద్రబాబు సీరియస్.. అలా చేయమంటూ ఎస్పీకి ఆదేశం..

Read Latest AP News And Telugu News

Updated at - Mar 19 , 2025 | 01:09 PM