Home » 2024
ఆ స్టేషన సిబ్బందిలో కొందరు విధి నిర్వహణ కంటే కాసుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్యూటీ దిగేలోగా జేబులు నింపుకుంటున్నారు. ప్రతి రోజు టార్గెట్ పెట్టుకుని మరీ దందాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆదాయ వనరును ఎంచుకుని, అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు ఇసుక మాఫియాతో మిలాఖత అయ్యారు. మరికొందరు ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని పట్టుకోవడం.. సెల్ఫోనలు లాక్కోవడం, బెదిరించి ...
స్వచ్ఛతాహి సేవపై ఏపీ పొల్యూషన కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం స్థానిక శారదానగర్లోని జేఎనటీయూ రోడ్డులో ఉన్న సైన్సుసెంటర్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీ లు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇతర యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200మంది విద్యార్థు లు హాజరయ్యారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని జనచైతన్యకాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తొలుత జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.
తాము వంద రోజుల పాలనలో ఏం చేశామో అదే చెబుతున్నామని, అందుకే దైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నా మని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అంతే దైర్యంతో వైసీపీ నాయ కులు ప్రజల్లోకి వెళ్లగలరా...? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని రామ గిరిలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. వందరోజుల్లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రజలకు నష్టం కలిగిస్తే సహించేది లేదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని ఎ నారాయణపురం పంచాయితీ స్టా లిన నగర్లో గురవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వినోద్కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో శిథిలమైన రహదారులను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించింది. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా నివేదికలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా (రాష్ట్ర రహదారులు, జిల్లా మేజర్ రోడ్లు) 68 పనులకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 383 కి.మీ. మేర రోడ్లు గుంతలమయమైనట్లు గుర్తించారు. మరమ్మతులకు ...
పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం చెరువుకు నీరు తరలించే కుడికాలువ నిర్వహణను వైసీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండింది. చూడటానికి చిట్టడవిని తలపిస్తుంది. దాదాపు 112 కి.మీ. పొడవు ఉన్న ఈ కాలువ మరమ్మతులకు గడిచిన ఐదేళ్లలో పైసా ఇవ్వలేదు. ప్రతి ఏటా నిధుల కోసం అధికారులు నివేదికలు పంపడం.. అవి బుట్టదాఖలు కావడంతోనే ఐదేళ్లు గడిచిపోయింది. కాలువకు ఇరువైపులా కంపచెట్లు పెరిగినందున నీరు వదిలితే గండ్లు పడే ప్రమాదం ఉంది. కూడేరు ...
రానున్న దసరా పండుగ లోగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించా లని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. 2023 ఖరీఫ్, రబీ ఇన్సూరెన్స ప్రకటించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులి వ్వాలనే పలు డిమాండ్ల సాధన కోసం ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతుల తో కలిసి బుధవారం స్థానిక క్లాక్టవర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యా లీ నిర్వహించారు.
నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ పక్కనున్న ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహాల గేటు ప్రాంతం వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారింది. సమీపంలో ఆస్ప త్రులు, కాంపౌండ్కు ఆనుకొని టీస్టాల్ ఉండటంతో అక్కడికొచ్చే వారు తమ వాహనాలను తీసుకొచ్చి హాస్టల్ గేటు ఎదుట నిలిపి వె ళ్తున్నారు. దీంతో హాస్టల్లోకి వెళ్లేందుకు... బయటికి వచ్చేందుకు విద్యా ర్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
గత వైసీపీ పాలనలో మండలంలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పరిటాలసునీత విమర్శించారు. వారి చి ట్టా తమవద్ద ఉందని, త్వరలో వారి ఆటకట్టిస్తామన్నారు. ఇది మంచి ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బుధవారం మండలంలోని ప్యాధిండి, చందమూరు, ఎనఎస్గేటు, చెన్నేకొత్తపల్లి, హరియన చెరువు గ్రామాల్లో పర్య టించారు. రూ.3.60 కోట్లతో చేపడుతున్న సీసీరోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.