• Home » Adilabad

Adilabad

Adilabad: కాలం మార్చిన రంగులు

Adilabad: కాలం మార్చిన రంగులు

వర్షాకాలంలో పచ్చదనంతో కనులవిందు చేసిన ఆ చెట్లు నేడు తలవాల్చాయి. వాన నీటిని ముద్దాడి మట్టి సువాసన వెదజల్లిన అదే భూమి నేడు వేసవిలో దాహార్తితో చిట్లిపోయింది.

బడిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

బడిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

అప్పటి వరకు హాస్టల్‌లోని తోటి విద్యార్థినులతో సరదాగా గడిపిన బాలిక.. కొద్ది సేపటికే విగత జీవిగా మారింది. రాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన ఆ విద్యార్థిని.. తెల్లారేసరికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలోని ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.

సలీం కోసం హిందువుల హనుమాన్‌ యజ్ఞం

సలీం కోసం హిందువుల హనుమాన్‌ యజ్ఞం

ఊరి కోసం ఎంతో చేయడమే కాక, కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి ఆ ఊరంతా ఒక్కటైంది. ప్రాణాపాయంలో ఉన్నది ముస్లిం అయినా సరే..

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.

Adilabad: పక్కింటి బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

Adilabad: పక్కింటి బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం

ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. 32 ఏళ్ల వయస్సు ఉన్న అతని కుమారుడు.. తమ పక్కింటిలో ఉండే నిండా 13 ఏళ్లు లేని ఓ బాలిక పట్ల కీచకులుగా మారారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్నారి అని కూడా చూడకుండా వేర్వేరుగా అత్యాచారానికి తెగబడి ఆ బాలిక బాల్యాన్ని చిదిమేశారు.

Apoorva Smmelanam.. 4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

Apoorva Smmelanam.. 4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆదిలాబాద్ జిల్లాలో తోయగూడ గ్రామస్థులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలా ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 40 ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామ శివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు.

Adilabad: నేటి నుంచి నాగోబా మహా జాతర

Adilabad: నేటి నుంచి నాగోబా మహా జాతర

ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది.

Adilabad: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

Adilabad: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

అప్పు లు తెచ్చి ఎన్నోఆశలతో సాగు చేసిన పంటలు దిగబడి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బల వన్మరణానికి పాల్పడ్డాడు.

Adilabad: లోయలో పడిన వాహనం ఒకరి మృతి.. 59 మందికి గాయాలు

Adilabad: లోయలో పడిన వాహనం ఒకరి మృతి.. 59 మందికి గాయాలు

ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్‌ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి