Home » Anantapur urban
గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్ర కీలకమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం డీఆర్డీఏ-వెలుగు కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యార్థి దశలో క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి శివప్రసాద్ యాదవ్ అన్నారు.
అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్కు సీపీఎం నాయకులు కోరారు.
ఎస్సీ వర్గీకరణకు పోరాటపటిమతో సాగించిన 30ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం దక్కబోతోందని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్ నేతలు హర్షాన్ని వ్యక్తంచేశారు. ఎస్సీల వర్గీకరణకు పచ్చజెండా ఊపుతూ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం సరసమైన ధరలకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం అమ్మకాల కౌంటర్లను పెంచి విక్రయాలను రెట్టింపు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. ప్రజలకు సరసమైన ధరలకే కందిపప్పు, బియ్యం తదితర సరకులను అందించాలని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను పౌరసరఫరాలశాఖ ద్వారా ఏర్పాటు చేయించి అమ్మకాలు చేయిస్తోంది.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు పెండింగ్ ఉంచి మెస్, కాస్మెట్ చార్జీలు ప్రభుత్వం చెల్లించాలని ఏఐఎ్సఎఫ్, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎ్సఎఫ్ నిర్వహిస్తున్న జీపుజాతా ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం కేఎ్సఆర్ కళాశాలలో నిర్వహించారు.
దేవరకొండ బాలగంగాధర్ తిలక్ 103వ జయంతిని గురువారం సాయంత్రం స్థానిక విశాలాంధ్ర బుక్హౌస్ వద్ద తెలుగు వెలుగు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకుడు టీవీ రెడ్డి మాట్లాడుతూ... భాష ఎంత మెత్తనిదో భావాలు అంత పదునైనవని పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందక్రిష్ణ నాయకత్వంలో చేపట్టిన సుదీర్ఘ పోరాటం ఫలించిందని ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చెన్నేకొత్తపల్లిలో గురువారం సంబరాలు జరుపుకున్నారు.
ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం వెంకటాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉపాధి హామీ కూలీల వద్దకు ఉదయం 6గంటలకే వెళ్లి పంపిణీచేశారు.
అనంత వ్యవసాయ మార్కెట్ యార్డు మరింత మెరుగుపడేలా పనిచేయాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డును సంబంధిత అధికారులతో కలసి ఆయన పరిశీలించారు.