Home » Anantapur urban
గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ అత్యవసర చికిత్సగా మారడంతో జిల్లా ఆస్పత్రిలో శనివారం డాక్టర్లు, వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం వెంటనే ప్రారంభించాలని ఎస్ఎ్ఫఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆర్ఐఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
అనంత జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై పాలకులు వివక్ష చూపడం అన్యాయమని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అటవీశాఖ అభివృద్ధి పనులపై విజిలెన్స డీఎ్ఫఓ రవిశంకర్ శర్మ, ఎఫ్ఆర్ఓ శంకరయ్య త మ బృందంతో కలిసి తనిఖీలు చేపట్టారు.
ఎస్కే యూనివర్సిటీలో రాజకీయాలకు చోటు లేదని ఏదైనా సరే నిబంధనల ప్రకారమే జరగాలని యూనివర్సిటీ రిజిసా్ట్రర్ రమేశబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత సూ చించారు.
కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలు మరువలేనివని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
జిల్లాలో ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని పీఎ్సఎ్ఫఐ, ఆర్ఎ్సవైఎఫ్ సంఘాల నాయకులు ఉప రవాణాశాఖాధికారిని కోరారు. గురువారం ఆర్ట్టీవోను ఆ సంఘాల నాయకులు కలిశారు.
కౌలు రైతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమాశంకరమ్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సోమశేఖర్ ఆధ్వర్యంలో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ ప్రభాకర్ రావు ఆదేశించారు. డీఎల్పీఓ సుమన జయంతితో కలిసి గురువారం తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. డీపీఆర్సీ కో-ఆర్డినేటర్ సౌజన్య, ఈఓఆర్డీ మాధవీలత తదితరులు హాజరయ్యారు.
తనకు, కుమార్తె, అల్లుడికి తమ్ముడి నుంచి ప్రాణహాని ఉందని, ఇదివరకే గొడ్డలితో నరికిన అతన్ని ఊరి నుంచి బహిష్కరించాలని మహబూబ్బీ అనే మహిళ ఎస్పీ కేవీ మురళీకృష్ణను కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాస్పందనలో ఎస్పీని కలిసి అర్జీ ఇచ్చారు.