Home » Anantapur urban
శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో వ్రతాలను ఆచరించారు.
సీఐడీ ఎటాచమెంట్లోని అగ్రిగోల్డ్ భూమిని ఎలా కొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ప్రశ్నించారు. బుధవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయన్నారు.
క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. బుధవారం స్థానిక బుడ్డప్పనగర్లోని రాజేంద్రనగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టును కలెక్టర్, ఎమ్మెల్యే దగ్టుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రారంభించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు.
కోల్కతా మెడికల్ కళాశాలలో మహిళా డాక్టర్ను అత్యాచారంచేసి హత్య చేసిన నరరూపరాక్షసుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు, మెడికోలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై నగరంలో డాక్టర్లు, మెడికోలు సోమవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.
నగరంలో 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక బళ్లారి బైపా్సలోని అన్న క్యాంటీనను ఎమ్మెల్యే పరిశీలించారు. క్యాంటీనలోని ఫర్నిచర్, తాగునీరు, వంట గదిని పరిశీలించారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సర్వజన ఆస్పత్రి కార్మికులు ఆందోళన చేపట్టారు. బకాయి వేతనాలు చెల్లించాలని, జీఓప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, ఈఎ్సఐ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ర్యాలీ చేపట్టారు.
అమ్మా.. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు దౌర్జన్యంగా మా భూములను ఆక్రమించుకున్నారు. వారిని ఎదిరించలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేగా మీరే మాకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు ఎమ్మెల్యే పరిటాల సునీతతో మొరపెట్టుకున్నారు.
జిల్లాలోని చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. ఆదిమూర్తినగర్లోని పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశాన్ని నిర్వహించి చర్చించిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ సూచించారు.