Home » AP Congress
సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
పీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ .. స్వయంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘బిగ్ డిబేట్’లో తెలుసుకుందాం వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లింక్ను క్లిక్ చేసి దమ్మున్న ఏబీఎన్లో చూసేయండి..
వైసీపీ (YSRCP)లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన నేత, నటులు పృథ్వీరాజ్ (Prithviraj) అన్నారు.ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్కి కాదు, కూటమికే రెండు బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అసభ్యంగా మాట్లాడే మంత్రులు ఎన్నికలయ్యాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్ని టార్గెట్గా చేసి మాట్లాడడం మానుకోవాలని మందలించారు.
ప్రత్యేక హోదాను సీఎం జగన్రెడ్డి (CM Jagan) కనుమరుగు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక చేత్తో పథకాలు ఇచ్చి ..మరో చేతితో జగన్ గుంజుకుంటున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
వైసీపీ (YSRCP) పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.