Home » AP Congress
AP Politics: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్(Chalo Secretariat) ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారిడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన వైఎస్ షర్మిల(YS Sharmila).. కేవీపీ ఇంటికి కాకుండా.. సడెన్గా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు..
కాంగ్రెస్(Congress) పార్టీ ఈనెల 22వ తేదీన సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం తక్కువ పోస్టులు భర్తీ చేసేలా కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.
లంగాణ ప్రభుత్వం నుంచి తనను డబ్బులు తెమ్మంటున్నారని... తాను డబ్బులు తెస్తే వైసీపీ నేతలు గాడిదలు కాస్తుంటారా అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఐదేళ్లుగా ముద్దులు పెట్టుకుంటూ బీఆర్ఎస్తో సీఎం జగన్ దోస్తీ చేశారని సెటైర్లు వేశారు.
సీఎం వైఎస్ జగన్ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడగడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila) అన్నారు. ఆదివారం నాడు తిరుపతిలో షర్మిల పర్యటించారు. వనక్కం అంటూ తమిళంలో మాట్లాడి క్యాడర్ను ఉత్సాహపరిచారు.
సీఎం జగన్(CM JAGAN) ఏపీకి స్పెషల్ స్టేటస్ తేలేదు... కానీ మద్యంలో స్పెషల్ స్టేటస్ తెచ్చారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఆరోపించారు. నాసిరకం మద్యం తాగి చనిపోతున్న వారిలో ఏపీలో 25 శాతం పెరిగినట్లు తెలిపారు.
వైఎస్ షర్మిల ( YS Sharmila ) కు కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పిస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) తెలిపారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.
2024లో ఏపీ కాంగ్రెస్ ( AP Congress ) కు మంచి టర్నింగ్గా మారనుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ( Manickam Tagore ) అన్నారు. బుధవారం నాడు విజయవాడలో పర్యటించారు.
వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. పోలింగ్ జరిగే రోజున ఇటువంటి గొడవలు చేయడం దురదృష్టకరం.