Home » Arrest
తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి శనివారం రాత్రి బెంగళూరులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి పోలీసులు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పులివర్తి నానిపై దాడి కేసులో విచారణకు పిలిచినా మోహిత్ రెడ్డి సహకరించడం లేదు.
తిరుపతి: తన కుమారుడు మోహిత్ రెడ్డి వయస్సు 25 ఏళ్లు అని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని, సంఘటన జరిగిన 52 రోజుల తర్వాత రాజకీయ కక్షతో తన కుమారుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..
నగరంలో హెరాయిన్ విక్రయించే ముఠా ఆటను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్), శంషాబాద్ ఎస్వోటీ, మాదాపూర్ పోలీసులు కట్టించారు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్ను సీజ్ చేశారు.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను తాండూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.45వేల విలువైన 500రూపాయల నకిలీ నోట్లు 90స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు మల్లంపేట బాచుపల్లికి చేరుకున్నారు. అక్కడ మరో నిందితుడు జగదీశ్ నివాసంలో ఏకంగా రూ.7.50లక్షల విలువైన నకిలీ 500రూపాయల నోట్ల స్వాధీనం చేసుకున్నారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేద్కర్(Manorama Khedkar)ను పుణె పోలీసులు(pune police) రాయ్గఢ్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఖేద్కర్ తల్లి పిస్టల్తో రైతులను బెదిరించిన వీడియో ఇటివల వెలుగులోకి వచ్చింది.
కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో భారతదేశ యువకులను పంపి.. అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్సబీ) అరెస్టు చేసింది.
తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హన్ముంతు అరెస్ట్ అయ్యాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రణీత్ను బెంగళూరులో బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో తండ్రీకూతురు బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీచకుడు ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ను హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటి మీద హైదరాబాద్కు తీసుకురానున్నారు.
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..