Home » BJP Candidates
కుల సంఘాలకు కార్యాలయాలు నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కుల సంఘాల తరఫున కల్యాణ మండపాలు నిర్మిస్తే ఆ కులంలోని ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
దివంగత మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్రోడ్డు సమీపంలోని రాథోడ్ రమేశ్ వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్(59) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న గంగాపురం కిషన్రెడ్డి, బండి సంజయ్లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రె్సకు అంచనాల కంటే తక్కువ సీట్లు రావడానికి గల కారణాలను విశ్లేషించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏఐసీసీ నియమించింది. పార్టీ జాతీయ నాయకులు పీజే కురియన్, రఖిబుల్ హుసేన్, పర్గత్సింగ్లను ఈ కమిటీలో సభ్యులుగా నియమించింది.
అనపర్తి ఆంజనేయనగర్లో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి(Satthi Suryanarayana Reddy) రోడ్డుకి అడ్డంగా నిర్మించిన గోడను బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (MLA Ramakrishna Reddy)తొలగించారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న సూర్యనారాయణ రెడ్డి గోడ నిర్మించటంతో ఐదేళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్డీ దేవెగౌడ, ఐకే
అంజన్ ఆద్మీ పార్టీ.. ఆప్కీ అప్నీ పార్టీ.. గరీబ్ ఆద్మీ పార్టీ..! ఇవెక్కడి పార్టీలు..? ఈ పేర్లే వినలేదు ఎప్పుడూ అనుకుంటున్నారా? సరే.. లాగ్ పార్టీ, హమారా సాహి వికల్ప్ పార్టీ.. ఓటర్స్ పార్టీ..! మరి వీటి గురించైనా తెలుసా..
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఆమె ప్రవర్తనపై ఎంఐఎం అభ్యంతరం తెలపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆమెపై మలక్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు మాధవీలతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.