Home » CM Chandrababu Naidu
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్ట’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఈ-పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతు వివరాలను ధాన్యం కొనుగోళ్లకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుంది. ఈ నేపథ్యంలో 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ను కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వంసం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని జగన్ విశ్వసించేవారా అని సూటిగా ప్రశ్నించారు. దేవుడిని నమ్మకుంటే దర్శించుకోవడం ఎందుకు.. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని నిలదీశారు.
ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి అంటీ రూ. 50 వేల విరాళం ఇవాళ(సోమవారం) అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు కుమారి ఆంటీ చెక్కు అందచేశారు.
ఏపీలో వరదలను ఎదుర్కొన్నతీరు సీఎం చంద్రబాబు పాలనదక్షతకు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు. కూటమి ప్రభుత్వం 100 రోజులపాలన సందర్భంగా సీఎం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపించారు.
ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు