Home » CM Chandrababu Naidu
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.
వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను గత పాలక మండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు భక్తులకు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
తిరుమల లడ్డూ వివాదంపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. లడ్డూ కల్తీకి కారణమైన దోషులను రక్షించాలని తాము చెప్పడం లేదని.. . తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటకు రావాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి కడుపు రగిలిపోతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని సూచించారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.
పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. జగన్ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వచ్చారు.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.