Home » Districts
ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లు అందరూ జిల్లాకు తిరిగొచ్చారు. జిల్లా నుంచి మొత్తం 39 మంది రాయలసీమలోని ఇతర జిల్లాలకు వెళ్లగా.. అందరూ అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. వారిలో ఇద్దరు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. మరో ఇద్దరు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారని తెలిసింది. మిగిలిన 35 మందిలో 31 మందిని జిల్లాలోని మండలాలకు కేటాయిస్తారు. నలుగురిని కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలకు కేటాయిస్తారు. పొరుగు జిల్లాల నుంచి తిరిగొచ్చిన తహసీల్దార్లు ...
నిన్న మొన్నటి దాకా ఓ రేంజ్లో రైతులకు లాభాలు కురిపించిన టమోటా ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. మొన్నటి వరకు అనంతపురం, కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో 16 కేజీల టామోటా బాక్స్ రూ.900లు పలికింది. అది ప్రస్తుతం రూ. 300లకు పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజక వర్గంలోని కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్ ...
నిత్య ఆరాధనతో పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. రామకృష్ణ సేవాసమితి 20వ వార్షికోత్సవాన్ని నగరంలోని ఓ ఫంక్షన హాల్లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓం సంగీత నృత్య శిక్షణాలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్య బృందం కోలాటం, నృత్య ప్రదర్శనలతో సామవేదం షణ్ముఖ శర్మను 3వ రోడ్డు నుంచి ఫంక్షన హాల్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఫంక్షన హాల్లో శ్రీ నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి శిష్యబృందం శివపదం నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. అనంతరం...
బీబీ ఫాతిమా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నగరంలోని ఐదో రోడ్డులో శనివారం సాయంత్రం పెద్ద సరిగెత్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీబీ ఫాతిమా పీర్లను సాయంత్రం నుంచి రాత్రి వరకూ వేలాది మంది భక్తులు దర్శించుకుని, చక్కెర చదివించి మొక్కు తీర్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటైన తినుబండారాలు, ఆటవస్తువుల దుకాణాలు కిటకిటలాడాయి. ఉత్సవ నిర్వాహకులు..
పదో తరగతి దాటితే.. ఎవరి దావ వారిదే..! మళ్లీ కలుసుకునేందుకు ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. వెతికి పట్టుకునేందుకు ఇప్పటిలాగా సెల్ఫోనలు, సామాజిక మాధ్యమాలు లేవు. అలాంటిది ఏకంగా 56 ఏళ్ల క్రితం పదో తరగతి (ఎస్ఎ్సఎల్సీ) చదివినవారు కలుసుకోవడం అంటే మాటలా..? యల్లనూరు మండలం తిమ్మంపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 1968-69 బ్యాచ ఎస్ఎ్సఎల్సీ విద్యార్థుల ...
శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. హంద్రీనీవా ఎత్తిపోతలకు అవసరమైన స్థాయికి నీటిమట్టం చేరింది. ఈ నెల రెండో వారం వరకూ వర్షాలు తక్కువగా ఉండటంతో డ్యాంలో నీటి నిల్వలు ఆలస్యంగా పెరిగాయి. గడిచిన పది రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో హంద్రీనీవా ఎత్తిపోతలకు మార్గం సుగమమైంది. పంపింగ్ ప్రారంభం కావాలంటే డ్యాంలో కనీస నీటి మట్టం 835 అడుగులను దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 867.7 అడుగులకు చేరింది. వరద జలాలు మల్యాల పంపు..
అది ఓ అరటి తోట. ఏపుగా పెరిగింది. లోపల ఎవరున్నారో? ఏం జరుగుతోందో కూడా తోట బయట ఉన్న వారికి తెలియదు. లోపల అసలు మనుషులు ఉన్నారన్న అనుమానం కూడా రాదు. ఇదే ఓ వైసీపీ నాయకుడి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. అందుకే ఆయన మూడు ముక్కల ఆటతో చెలరేగిపోతున్నాడు. ఈ ఆట వైసీపీ పాలనలో మొదలై నేటికీ కొనసాగుతోంది. అయితనా దీన్ని ఆపేవారు లేరు. ఈ తతంగమంతా పుట్లూరు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసుల అండదండలతోనే వైసీపీ ...
మండలంలోని జగనన్న లేఔట్లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ...
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...
అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో రేషన షాప్ నంబర్ 1225055 ఉంది. ప్రతి నెలా ఈ దుకాణానికి 90 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. కానీ ఆగస్టుకు సంబంధించి ఆ డీలర్కు 22 క్వింటాళ్లు మాత్రమే సరఫరా కానున్నాయి. అక్కడ 67 క్వింటాళ్ల బఫర్ స్టాక్ ఉన్నట్లు చూపడమే దీనికి కారణం. వైసీపీ వర్గీయుడైన ఆ డీలర్ 67 క్వింటాళ్లకుపైగా బఫర్ చూపించారు. దీంతో ఆ లోటును ఎలా భర్తీ చేసుకోవాలో తెలియక కొత్తగా డీలర్షిప్ దక్కించుకున్న వ్యక్తి సతమతమవుతున్నారు. ఇదే ప్రాంతంలోని షాపు నంబరు 1225042లో సుమారు 38 క్వింటాళ్ల కొరత ఉంది. పాపంపేట ప్రాంతంలో ఏడు రేషన దుకాణాలు ....