Home » Districts
ఇది డంపులో జరిగిన అవినీతి కంపు కథ. వైసీపీ అధికారంలో ఉండగా, అప్పటి ఆ పార్టీ ప్రజాప్రతినిధుల బినామీ సంస్థల అడ్డగోలు బాగోతం. ఆ పార్టీ వారే నిలదీసినా, కడిగేసినా పట్టించుకోకుండా దోపిడీ చేసిన వైనం. లక్షలాది మంది నగర ప్రజలకు సమస్యగా మారిన డంపింగ్ యార్డును కూడా అక్రమ సంపాదనకు వాడుకున్నారు. పాత చెత్తను పూర్తిగా తరలించాల్సింది పోయి.. పాత చెత్తను, కొత్త చెత్తను ఒకే చోట పోసి రూ.కోట్లు కొల్లగొట్టారు. కొందరు ఆడిట్ అధికారులు రైట్ రైట్ అంటూ బిల్లుల చెల్లింపునకు గ్రీనసిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రూ.9 కోట్ల పేమెంట్ జగినట్లు సమాచారం. మరో రూ.2 కోట్లను సైతం నొక్కేయాలని చూశారు. కానీ కొందరు ఆడిట్ అధికారులు చెక్ పెట్టడంతో ఆగినట్లు సమాచారం. ...
చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని వెళుతున్న వీరు బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. గ్రామంలో ఉన్న పాఠశాలలో గదుల కొరత ఉంది. దీంతో ఉన్నత పాఠశాల భవనాన్ని ఊరికి దూరంగా నిర్మిస్తున్నారు. పనులు పూర్తి కాకనే.. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను అక్కడికి తరలించి.. పాఠాలు చెబుతున్నారు. కానీ మధ్యాహ్న భోజనం మాత్రం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే పెడుతున్నారు. దీంతో రోజూ ఇలా కి.మీ. దూరం తట్టలు ఎత్తుకుని ...
డీఆర్డీఏ, డ్వామా పీడీ పోస్టుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని పీడీలుగా నియమించారు. సుమారు ఐదేళ్లు ఆ ఇద్దరే పీడీలుగా కాలం గడిపేశారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిద్దరూ సొంతశాఖలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. డీఆర్డీఏ పీడీ ఇప్పటికే 15రోజులు సెలవులో వెళ్లారు. డ్వామా పీడీ తన సొంత శాఖ జైళ్ల శాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలకు ఇద్దరు పీడీలు అంటకాగి అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఇక ఇద్దరు పీడీలు ...
మండలంలో వైసీపీ నాయకుల మట్టిదందాకు అడ్డు అదుపులేకుండా పోయింది. యాడికిలోని వేములపాడు రోడ్డులో ఆదివారం అక్రమంగా మట్టిని తరలించి విక్రయాలు జరిపారు. స్థానిక మరువ వంకలో ఉపాధిహామీ పథకం కింద ఫారంపాండ్ తవ్వారు. ఆ మట్టిని సైతం ఎక్స్కవేటర్ల ద్వారా ట్రాక్టర్లో నింపి రూ.వెయ్యికి విక్రయించేశారు. ఆదివారం సెలవు రోజు కావడం, అధికారులు ఎవరూ అటువైపు రాకపోవడంతో వైసీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా సాగింది. ఒక్కరోజులోనే దాదాపు వంద ట్రాక్టర్ల మట్టిని
అనంతపురం నగరంలో అపరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో.. నగరపాలికలోని పారిశుధ్య విభాగంలో అవినీతి కంపు అంతే స్థాయిలో ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి మొదట్లో ఇంటి నుంచి శుభ్రంగా మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారట. ఇప్పుడు రోజూ నగరంలోని రెస్టారెంట్లకు వెళుతున్నారని సమాచారం. తాను తినడంతోపాటు.. ఇంటికెళ్లే సమయంలో పార్శిల్ తీసుకుపోతుంటారని అంటున్నారు. పారిశుధ్య విభాగంలో చాలామంది కీలక ఉద్యోగులు నగర ...
జిల్లా అటవీశాఖలో జరిగిన అక్రమాలపై ఏపీసీసీఎఫ్( అడిషినల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్కే సుమన సోమవారం ఆరా తీశారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కేంద్రానికి వచ్చారు. సీసీఎఫ్ నాగేశ్వరరావుతో కలిసి అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు, చిత్తూరు జిల్లా డీఎ్ఫఓలతో సమావేశమయ్యారు. శాఖ పరమైన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుమస్తాలకు సంబంధించి ..
ఖరీఫ్ విత్తన సాగుకు మృగశిర కార్తె తరువాత పునర్వసు అనుకూలమని రైతులు విశ్వసిస్తారు. ఈ కార్తెలో విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుందని అంటారు. ఈనెల 21తో మృగశిర కార్తె ముగిసింది. ఆలోగా పదును వర్షాలు కొన్ని ప్రాంతాల్లోనే పడ్డాయి. దీంతో 5,800 హెక్టార్లలో పంట సాగైంది. పునర్వసు కార్తె వచ్చే నెల 5న మొదలౌతుంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఈనెల ఆరంభంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో దుక్కి దున్ని.. పొలాలను సిద్ధం చేసుకున్నారు. వేరుశనగ, కంది తదితర విత్తనాలను సైతం తగినన్ని సమకూర్చుకున్నారు. ఒక్క తడి ...
జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి కమిటీతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో డ్రగ్స్ రవాణా, గంజాయి సాగు, రవాణా కాకుండా చూడాలని అన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు వినియోగించకుండా విద్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు...
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అధికారులు కూడా మారిపోతున్నారు. కానీ గృహనిర్మాణ శాఖలో మాత్రం కొందరు అధికారులు ఇంకా వైసీపీ సేవలో తరిస్తున్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారుల విషయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకా్షరెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ గుట్టుగా వ్యవహారం నడిపిస్తోంది. లబ్ధిదారులపై ఒత్తిడి చేసి ఉపాధి బిల్లులు వసూలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆదేశాలను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఏమాత్రం ఆలోచన చేయకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను గ్రూపులుగా విభజించి మరీ వసూళ్లకు ఉసిగొల్పుతున్నారని సమాచారం. ...
కోటంక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి రూ.7.80 లక్షలు విలువైన బంగారు, వెండి అభరణలను ఎత్తుకుపోయారు. గ్రామ సమీపంలోని గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో నాలుగువారాలు పాటు స్వామివారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటి ప్రఖ్యాత ఆలయంలో చోరీ జరగడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన ద్వారాలను ఇనుప రాడ్లతో ద్వంసం ...