Home » Districts
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్) ప్రమాదంలో పడింది. డ్యామ్కి అమర్చిన 19వ క్రస్ట్గేట్ చైన లింక్ తెగిపోయి, శనివారం రాత్రి కొట్టుకుపోయింది. దీంతో డ్యామ్లోని నీటిని నదికి వదిలేస్తున్నారు. సుమారు 65 టీఎంసీల మేర నీరు నదికి విడుదల చేయనున్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ శ్రీకాంతరెడ్డి తెలిపారు. డ్యామ్లో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గితేనే కొత్త క్రస్ట్గేట్ అమర్చడానికి అవకాశం ఉంటుందని బోర్డు ఇంజనీర్లు తెలిపారు. డ్యామ్కి మొత్తం ...
లోక కల్యాణార్థం ఆదివారం పాతూరు దత్తాత్రేయ మందిరంలో శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ...
జిల్లాలో గ్రేడ్-4 పంచాయతీ సెక్రటరీలుగా పని చేస్తున్న వారు అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వారిపాలిట శాపంగా మారింది. జిల్లాలోని 31 మండలాల్లో గ్రేడ్-4 పంచాయతీ సెక్రటరీలుగా 497 మంది పనిచేస్తున్నారు. వీరికి 2016కు ముందు సీనియార్టీ జాబితా తయారుచేసి ఉద్యోగోన్నతులు కల్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ సీనియార్టీ జాబితా తయారు చేయని కారణంగా అర్హత ఉన్నా ఉద్యోగోన్నతికి నోచుకోలేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పలువురు కొత్తగా గ్రేడ్-4 పంచాయితీ సెక్రటరీలుగా ఎంపికయ్యారు. కానీ పాతవారికి మాత్రం ఎనిమిదేళ్లుగా ఉద్యోగోన్నతి కల్పించడంలేదు....
జిల్లా ఆస్పత్రిలో కొందరు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆస్పత్రి కంటే నరకమే నయమనేలా కొందరి తీరు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు. అసలే తమ మనిషి చచ్చిపోవడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని సైతం కాసుల కోసం పీడిస్తున్నారు. డబ్బులిస్తేనే పోస్టుమార్టం చేస్తామంటూ వేధిస్తున్నారు. ఇవ్వకపోతే గంటలతరబడి నిరీక్షించాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా తెలిసినా...
శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కసాపురం, నేమకల్లు, మురడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే స్వామి వారి మూల విరాట్టుకు అభిషేకాలు చేశారు. ఆభరణాలు, పుష్పాలతో అలంకరిచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయాల్లో హనుమానాచాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కసాపురంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహా లను అలంకరించి శేష వాహనంపై ..
మండలకేంద్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణం అంతులేని కథలాగా తయారైంది. 50మంది లబ్ధిదారులతో ఒక్కొక్కరితో రూ.35వేలు అదనంగా కట్టించుకున్న కాంట్రాక్టర్, అధికారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. ఆరునెలల నుంచి కాంట్రాక్టర్ జాడ లేకుండా పోవడంతో హౌసింగ్ లబ్ధిదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇళ్లను తామే కట్టించి ఇస్తామని ప్రభుత్వం 3వ ఆప్షన ఇవ్వడంతో 120మంది లబ్ధిదారులు దీన్ని ఎంచుకున్నారు. అయితే ఇళ్ల ...
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలవారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్కు అరుదైన...
చూస్తున్నారు కదా..? ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో..! యాడికి నుంచి బుగ్గకు వెళ్లే రోడ్డు, రాయలచెరువు నుంచి చందనకు, అక్కడి నుంచి దైవాలమడుగు వరకూ వెళ్లే రోడ్డు, యాడికి నుంచి రాయలచెరువుకు వెళ్లే రోడ్డు, తూట్రాళ్లపల్లి నుంచి నగరూరుకు వెళ్లే రోడ్డు.. ఏ దారి చూసినా గుంతలమయమే. వర్షాలు కురవగానే చిన్నపాటి నీటి మడుగులుగా మారుతాయి. ఆ తరువాత బురదగుంతలుగా తయారౌతాయి. ఎండకాచి ఆరిపోయిన తరువాత.. దుమ్ము రేగుతాయి. ఇలా ఒకదాని తరువాత ఒక ...
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు నిరాశజనకంగా ఉంది. జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లు కాగా... ఇప్పటి దాకా 1.43 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. మిగిలిన 2.03 లక్షల హెక్టార్ల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రకృతి సహకరిస్తుందన్న ఆశతో తాజాగా 40 వేల హెక్టార్లలో రైతులు కంది విత్తుకోవడంతో ఆమాత్రం సాగువిస్తీర్ణమైనా కనిపిస్తోంది. రెండు వారాల కిందట 80 వేల హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. ఆ తరువాత కందితోపాటు వేరుశనగ, ఇతర పంటలను కొంతమేర సాగు చేశారు. దీంతో 1.43 లక్షల హెక్టార్లకు చేరిందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ...
వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్ల మరమ్మతులకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. విపక్ష నాయకులు, ప్రజలు ప్రశ్నించినా ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. ప్రజలకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక రోడ్లు బాగుపడతాయని జనం భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ అభివృద్ధి అంశాలపై కసరత్తు మొదలెట్టారు. గ్రామీణ రోడ్ల ...