Home » Flood Victims
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం జరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వయనాడ్ మాజీ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ప్రకృతి వైపరీత్యంలో బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
గత కొన్ని రోజులుగా చైనా(china)తోపాటు ఉత్తర కొరియా(North Korea), తైవాన్(taiwan)లో భారీ వర్షాలు(heavy rains) కురుస్తు్న్నాయి. ఇదే సమయంలో ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్ ప్రావిన్స్లో కూడా ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారు వరదల్లో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్ను ఫోన్లో పరామర్శించారు.
చైనా(china)లో గత కొన్ని రోజులుగా వర్షాలు(heavy rains) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో వినాశకర దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ఆగ్నేయ చైనాలో వరదల కారణంగా ఓ ఇంటిపై బురద పడి 11 మంది మరణించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే కొంత మంది బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. భారీ వర్షం కురిస్తే చాలు నీరు అంతా ఇంట్లోకి వచ్చేస్తోంది. ఇక, ఆ వరద తగ్గే వరకు ఆ నీటిలోనే మనుగడ సాగించాల్సి ఉంటుంది.
మహారాష్ట్రలోని రత్నగిరిలో దారుణం జరిగింది. నదిలోకి ఈత కొట్టేందుకు దిగిన వ్యక్తి కళ్ల ముందే కొట్టుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రత్నగిరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాలకు ఖమ్మం, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాగుల్లోకి వరద నీరు పోటెత్తడంతో వరి చేలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురవగా,
మహారాష్ట్రని భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. ఇప్పటికే ముంబయి మహా నగర ప్రజలు వరదలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటుండగా.. విద్యా సంస్థలకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సమస్యా్త్మక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి.
ఆపదల్లో ప్రాణం కాపాడిన వారిని దేవుడిలా వచ్చి కాపాడావంటూ కృతజ్ఞతలు చెప్పుకోవడం సహజం. ప్రకృతి ప్రకోపంతో వరద నీటిలో చిక్కుకున్న ఓ మణిపూర్ యువకుడు తనను లైఫ్ బోట్తో కాపాడిన అసోం రైఫిల్స్ సిబ్బందికి వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేయాడు. సంప్రదాయ గీతాన్ని వారికి వినిపించి ఉత్సాహపరిచాడు.