Home » God
మండలంలోని ఎర్రబల్లిలో గంగమ్మ జాతర వేడుకలను మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యం లో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిగి 41రోజులు కావడంతో జాతర చేశారు.
పట్టణ పరిధిలోని రెండో మోడల్ కాలనీలో వెలసి న గంగమ్మ దేవత ఆలయంలో మంగళవారం జ్యోతుల మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం బెస్త సం ఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెలవారు జాము న నుంచే అమ్మవారి మూల విరాట్కు వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరిం చా రు. అర్చనలు తదితర పూజా కార్యక్రామలు చేశారు.
భక్తులు కొంగు బంగారంగా కొలిచే, నవగ్రహాలలో ఒకరై న శనీశ్వరుడి జ యంతిని గురువారం పావగడ శనీశ్వర ఆలయంలో ఘనం గా నిర్వహించారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన నల్ల గుడ్డ, నూగులతో ఉదయం 4గంటల కు తైలాభి షేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. పావగడలో వెలసిన జేష్టదేవి సమేతుడైన శనీశ్వరుడిని పు ట్టినరోజు సందర్భంగా దర్శించుకుంటే పంచమ శని, అష్టమశని, ఏలినా టిశని, కాకి స్పర్శ తదితర దోషాలు తొలుగుతాయని, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని భక్తుల విశ్వాసం.
మడకశిర ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవం శనివా రం అత్యంత వైభవంగా జరింగింది. ఈ సం దర్భంగా ఉదయం స్వామి వారికి వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంక రించా రు. అర్భనలు తదితర పూజలు చేశారు. ఆల యం ఆరణంలో హోమాలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు జ్యోతుల తో ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కులు తీర్చుకున్నా రు.
హనుమజ్జయంతి వేడుకలను ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మూల విరాట్లకు వివిధ అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే హనుమాన చాలీసా పారా యణం, భజనలు, రామ కీర్తనలు, రామ నామం, ఆంజనేయ దండకంతో ఆలయాలు మార్మోగాయి. పలు ఆలయాల్లో సీతారామకల్యాణోత్సవం నిర్వహించారు.
మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ నెల 21 నుంచి ఉత్సవాలు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువుదీర్చి మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆమిద్యాలకు తీసుకెళ్లారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన చందకచర్ల ఆంజనేయస్వామి బ్రహ్మోత్స వాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు దేవదాయశాఖ ఈఓ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారి ఆలయంలో ద్వారారాధన, అంకు రార్పణ, కుంభారాధన, హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్య క్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధ్వజరోహణ కార్యక్ర మాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకానాథా చార్యులు శాస్రోక్తంగా నిర్వహిచారు. రాత్రి ప్రాకా రోత్సవాన్ని నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ అమ్మవారి గర్భగుడిలో ఈరోజు(ఆదివారం) అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం పూజారులు అమ్మవారికి పూజ నిర్వహిస్తున్న సమయంలో గర్భగుడిలోని దేవతామూర్తిపై సూర్యకిరణాలు నిలువుగా ప్రసరించాయి. ఈ దృశ్యం చూసిన పూజారులు, భక్తులు మంత్రముగ్ధులయ్యారు.
దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఎవరి నమ్మకం వారిది! ఏదో ఒక దైవశక్తి మనుషుల్ని నడిపిస్తోందని విశ్వసించేవారిని దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే ఆకాశమే చిరునామా అంటారు. ఆకాశం నుంచి ఆ దేవుడు...