Home » HYDRA
ఎన్.. కన్వెన్షన్ నేలమట్టం.. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రచ్చ! టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) చెందినది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయ్యింది. హైదరాబాద్ నగరంలోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం ‘హైడ్రా’ను ఝులిపించిన సంగతి తెలిసిందే...
హైడ్రా.. ఇప్పుడీ పేరు ఎవరినోట వచ్చినా, ఎక్కడైనా చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్..! ఎప్పుడు తమవంతు వస్తుందో.. బుల్డోజర్ ఏ టైమ్లో వచ్చి ఇంటి మీద పడుతుందో అని కబ్జాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి..! శభాష్ అంటూ సామాన్య జనం నుంచి సెలబ్రిటీల వరకూ హైడ్రా పనితీరును, రేవంత్ సర్కార్ను మెచ్చుకుంటూ ఉండగా..
భాగ్యనగరంలో జలవనరులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించటమే ధ్యేయంగా సాగుతున్న హైడ్రా సంచలనాలకు కేరాఫ్గా మారింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన, చేస్తున్న వారిని గడగడలాడిస్తోంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చెందినదేనంటూ కాంగ్రెస్ పార్టీ పదేపదే చెబుతున్న జన్వాడలోని ఫామ్ హౌస్ కూల్చివేతకు హైడ్రా దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ దిశగా దూకుడు పెంచినట్టుగా సమాచారం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రముఖుల అక్రమ నిర్మాణాలే టార్గెట్గా దూసుకుపోతున్న హైడ్రా.. 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌస్పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ అంటేనే చెరువులు, కుంటలు, ఉద్యానవనాలతో అలరారిన నగరం. మహ్మద్ కులికుతుబ్ షా కలలకు అనుగుణంగా మీర్ మోమిన్ రూపకల్పనలో పురుడు పోసుకున్న ఈ నగర నిర్మాణంలోనే అవన్నీ భాగమయ్యాయి.
హైడ్రా తమ ఆస్తుల విషయంలో అక్రమంగా జోక్యం చేసుకుంటోందని, కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ శనివారం పలు విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని గండిపేటలో రోడ్డుని ఆనుకుని అక్రమంగా నిర్మించిన 28 దుకాణాలను అధికారులు కూల్చేశారు.
ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ముందుకు వెళ్లకుండా యథాతథ స్థితి(స్టేటస్ కో) విధిస్తూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.