Home » IAS
రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీనా(Shivdas Meena) ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీస్ టక్కర్ ప్రజా, పునరుజ్జీవన శాఖ కార్యదర్శిగాను, ఆ శాఖ కార్యదర్శి నందకుమార్ మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.
శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల(IAS, IPS) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా, దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో..
సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా.? ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి, వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి తాజా పరిణామాలు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారాన్ని మూసి వేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు మూడు స్టెప్పుల మేర ఇనుప తీగలతో లాక్ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్నిస్తున్నాయి.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐసి్స’లో కరుడుగట్టిన సభ్యులుగా పనిచేస్తున్న 17 మందిపై ఎన్ఐఏ సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. బాంబులు తయారు చేయడం, యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం,
మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన రోహిణి సింధూరి(Rohini Sindhuri) అక్కడి అతిథిగృహంలో ఉండేవారు. ఇదే సందర్భంలో పలు వస్తువులు మాయమయ్యాయి. వాటికి సంబంధించి నగదు సమకూర్చాలని పర్యవేక్షణ సంస్థ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రోహిణి సింధూరి వేతనం నుంచి కోత విధించాలని ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రంలో బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని, జిల్లా స్థాయిలో వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
Andhrapradesh: ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిల్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూవివాదాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ యాక్ట్పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్లో తాను బాధితుడినే అని పేర్కొన్నాడు.