Home » ICC
ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ను భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల జట్టు ఎంపిక తీరు పలు విమర్శలకు తావిస్తోంది. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఆశ్చర్యానికి గురిచేశాయి. 114 పరుగులు ఛేజ్ చేయడానికి ఐదు వికెట్లు కోల్పోవాలా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. విండీస్ వంటి జట్టు మీదనే ఇంత కష్టపడితే.. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై వీళ్లేం గెలుస్తారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ను(ICC Test Ranking) విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెరో స్థానం ఎగబాకారు.
బంగ్లాదేశ్తో శనివారం జరిగిన మూడో వన్డేలో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్పై ఐసీసీ నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని క్రిక్ బజ్ ఓ కథనం ప్రచురించింది. ఇదే నిజమైతే హర్మన్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశం ఉంది.
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా.. ఆల్రౌండర్ల విభాగంలో జడేజా టాప్లో కొనసాగుతున్నాడు.
ఐసీసీ ప్రకటించిన వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్పై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) శర్మ స్పందిస్తూ "ఆట వేగంగా మారింది" కాబట్టి దేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ అత్యంత పోటీగా ఉంటుందని తెలిపాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. మొత్తం 10 జట్లు పోటీ పడనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది.
ఆరు నెలలుగా క్రికెట్ ఆడకపోయినప్పటికీ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant ) టెస్ట్ ర్యాంక్కు ఢోకా లేకుండాపోయింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాకింగ్స్లో (ICC Rankings) పంత్ తన 10వ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ర్యాంకులో ఉన్న టీమిండియా(Team India) బ్యాటర్గా నిలిచాడు. అంతేకాకుండా టాప్ 10లో ఉన్న ఏకైక టీమిండియా బ్యాటర్ కూడా పంతే కావడం గమనార్హం.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 విజేత ( World Test Championship 2021-23) గెలుచుకోబోయే ప్రైజ్ మనీని (Prize money) ఐసీసీ (ICC) ప్రకటించింది. గత ఛాంపియన్షిప్ 2019-21 మాదిరిగానే 2021-23లో కూడా రూ.31.4 కోట్ల మొత్తాన్ని ప్రకటించింది.