Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు, పంప్హౌజ్ల నిర్మాణం జరిగిన తీరుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది. వాటి నిర్మాణ సమయంలో విధులు నిర్వర్తించిన 40 మంది దాకా అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(ఏఈఈ)లను ప్రశ్నించింది.
పంప్హౌస్ల హెడ్లకు నీరు తాకేలా ఉండాలన్న కారణంతోనే బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడంతో బ్యారేజీలు దెబ్బతిన్నాయా? అని జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది.
Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. తాజాగా కాళేశ్వరంపై రిపోర్ట్ను కమిషన్కు కాగ్ అందజేసింది. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణకు అధికారులు సహకరించడం లేదా? కీలక పత్రాలను దాచేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాళేశ్వరం పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అక్కడే కట్టాలని సిఫారసులు ఏమైనా ఉన్నాయా?
బ్యారేజీల నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భారతీయ ప్రమాణాల సంస్థ (ఇండియన్ స్టాండర్డ్) కోడ్-7349ను కాళేశ్వరం నిర్మాణంలో పాటించలేదని, నిర్వహణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా విచారణ ప్రక్రియలో పలు దశలు మిగిలి ఉండడాన్ని గుర్తించిన ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికే క్యాబినెట్ మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయని, ఆ రెండు అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్ఠానానికి అందించామని చెప్పారు.
ముఖ్యమంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అది కూడా వంద వాట్స్ బల్బులాగా కాంతులీనారు. మేము మోనార్కులమన్నట్లుగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రజాస్యామ్యదేశంలో ప్రజలు తమకు ఈ హోదా కట్టబెట్టారన్నట్లుగా కాకుండా.. తాము దైవాంశ సంభుతులమని.. తమ జాతకంలో గజకేసర యోగం కదంతొక్కుతుందని.. అందుకే తమకు ఈ యోగం.. ఈ మహారాజ యోగం దక్కిందన్నట్లుగా మసులుకున్నారు.