Home » Mancherial
రక్షా బంధన్.. సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రవణ మాసం పౌర్ణమి నాడు వచ్చిన ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఆగస్టు-19న ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నారు. సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో అంతా మంచే జరగాలని ప్రార్థిస్తారు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 8 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవగా.. 35 మండలాల్లో భారీ వానలు పడ్డాయి. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచిర్యాల: జిల్లాలో ఓ పసివాడికి అరుదైన వ్యాధి సోకింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ వేస్తే తప్ప బాబు బతికే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో బాలుని తల్లి దండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేక దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు.
శారీరక ఎదుగుదల లేకపోవడంతో ఏడాది వయసున్న బాబును ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రుల గుండెలు బద్ధలయ్యాయి! బాబు, కోటి మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని స్వస్థత పొందాలంటే రూ.16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయించాలని వైద్యులు చెప్పారు.
రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని రెండు బొగ్గు నిక్షేపాల బ్లాక్లను దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా... తాజాగా మరో మూడో బ్లాక్(శ్రావణపల్లి)ని శుక్రవారం వేలం వేస్తున్నారు.
కనీపెంచి పెద్దచేసిన తండ్రి వృద్ధాప్యంలో కదల్లేనిస్థితికి చేరుకోగానే వదిలేశాడా కొడుకు! ఆ వృద్ధుడికి భార్య బతికున్నా బాగోగులు చూసేదేమో! తండ్రి అవసానదశలో ఉన్నాడని గానీ, తాను వదిలేసి వెళితే ఆయన పరిస్థితి ఏమిటి అని గానీ ఆ కుమారుడు ఆలోచించలేదు.
రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావం కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవారం 46 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వీధి కుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం వీధి కుక్కలు రెచ్చిపోయడంతో ఇద్దరు బాలురుతో సహా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.