Home » Mancherial
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్దీపక్కు అందజేశారు.
మండల కేంద్రంలోని రైతు వేది కలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మంచినీటి సహాయకుల శిక్ష ణ తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యం కార ణంగా అన్నదాతకు నష్టం వాటిల్లగా ప్రభుత్వపరంగా సాయం అందించ డంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట నీటి పాలుకావడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేలకు వేలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట మొలక దశలోనే నీట మునగడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి.
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడాలని రామగుండం సీపీ శ్రీని వాస్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు బెది రింపు రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. మంగళవారం బీజేపీ కార్యాల యంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు బీజేపీ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుల పై కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.
ఎన్నికల సమయంలో తనను చంపేందుకు సుపారీ ఇచ్చి మనుషులను తెప్పించారని, నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారంటూ ఎమ్మె ల్యే ప్రేంసాగర్రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. మంగళవారం ఆయ న నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహిం చారు.
రైతులు రసాయన ఎరువులను పంటల్లో కుమ్మరిస్తున్నారు. అవసరానికి మించి ఎరువులను వాడుతున్నారు. అధిక వినియోగంతో జిల్లా నేలల్లో భాస్వరం, పొటాష్ నిల్వలు పేరుకపోయాయి. విచ్చలవిడిగా ఎరువులను వాడడంతో కొన్ని నేలల్లో పోషకాలు ఎక్కువగా, మిగతా చోట్ల తక్కువగా ఉన్నాయి.
చెన్నూరు పట్టణం ఆస్నాద్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కుమ్మరికుంట చెరువు సర్వేను సోమ వారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తగా సర్వే ప్రారంభించారు. సర్వే ప్రారంభంతో కుమ్మరికుంట బఫర్ జోన్లో నిర్మించుకున్న ఇంటి నిర్మాణదారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.
అక్రమాలకు పాల్ప డిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయ న్నారు.
గ్రామాల్లో స్వచ్ఛ మైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటున్నా మని ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేష్ తెలిపారు. సోమవారం ఎంపీడీవో కార్యాల యంలో బెల్లంపల్లి, తాండూర్ మండలాల గ్రామ మం చినీటి సహాయకులకు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు.