Home » Ponnam Prabhakar
హైదరాబాద్లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.
టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అడుగు పడింది. వివిధ విభాగాల్లో మొత్తం 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతినిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు చెప్పారు. టీఎస్ఆర్టీసీ(TSRTC)లో 3,035ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. 2014తర్వాత మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గతంలో తిరుమలకు వచ్చిన తెలంగాణ భక్తులు దర్శనం విషయంలో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సూచించారు. జూలై 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది.
అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ‘ ఫ్లై యాష్ రవాణాలో నాకు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) లీగల్ నోటీసులు పంపించారు.
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.
రుణమాఫీ విషయంలో ప్రత్యేకంగా కొత్త నిబంధనల పేరుతో కోతలు విధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లేదని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో రెండుసార్లు రుణమాఫీ అమలైంది. అప్పుడు రెండుసార్లు కలిపి సగంసగమే మాఫీ చేసినా రూ.21వేల కోట్లు నిధులు ఖర్చయ్యాయి.
రుణమాఫీపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు.