Home » Skill Development Case
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం బెయిల్ వస్తుందా.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారా.. ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా అన్న ఉత్కంఠ దేశవిదేశాల్లోని తెలుగు ప్రజల్లో నెలకొంది. బెయిల్ కోసం ఆయన హైకోర్టు, ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపైన, సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పైన సోమవారం తీర్పులు వెలువడనున్నాయి.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును (Nara Chandrababu) అక్రమంగా సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు (AP Politics) ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా...
టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మాగ్రహ శాంతి ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీతో జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్డీఏతో (NDA) ఉన్నారా..? తెగదెంపులు చేసుకున్నారా..?..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి...
టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన ఆరోపణలలో ఒక్క దాన్ని కూడా ఆధారాలతో నిరూపించలేక పోయారని మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మూడో విచారణ జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తవ్వగా ప్రస్తుతం కస్టడీ పిటిషన్పై వాదనలు జరగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill development case) ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు (గురువారం) వాదనలు కొనసాగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.