Home » Skill Development Case
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
స్కిల్డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...
స్కిల్ డెవల్మెంట్ కేసులో (Skill development case) అక్రమ అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu arrest) పెద్దఎత్తున మద్ధతు లభిస్తోంది. అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాలని పార్టీ తీసుకున్న నిర్ణయానికి నందమూరి సుహాసిని మద్ధతు ప్రకటించారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వస్తోంది. ‘‘మోత మోగిద్దాం’’ అంటూ బ్రహ్మణి ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే విశాఖ వాసులు సంపూర్ణ మద్దతు తెలిపారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్పై (Chandra Babu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని.. వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు, ఆందోళనలు కూడా చేపట్టారు.
చంద్రబాబు నాయుడుకి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సతీమణి బ్రహ్మణి పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.