Paritala Sunitha: న్యాయం జైల్లో ఉందని.. అన్యాయం యధేచ్చగా తిరుగుతోంది...

ABN , First Publish Date - 2023-10-02T12:38:23+05:30 IST

సత్యమేవ జయతే దీక్షలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన దీక్ష చేపట్టారు.

Paritala Sunitha: న్యాయం జైల్లో ఉందని.. అన్యాయం యధేచ్చగా తిరుగుతోంది...

అనంతపురం: సత్యమేవ జయతే దీక్షలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత (Former Minister Paritala Sunitha) నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) నిరసిస్తూ సిండికేట్ నగర్‌లో సునీత దీక్షకు దిగారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... న్యాయం జైల్లో ఉందని.. అన్యాయం యధేచ్చగా బయట తిరుగుతోందని విమర్శించారు. లక్ష కోట్లు అవినీతి చేసి పదేళ్లుగా బెయిల్‌పై తిరుగుతున్న వ్యక్తి జగన్ అని అన్నారు. ఏ తప్పు చేయకున్నా జైలులో చంద్రబాబును హింసిస్తున్నారని మండిపడ్డారు. బాబాయ్‌ను హత్య చేసిన వ్యక్తిని సీబీఐ అరెస్టు చేయలేకపోయిందన్నారు. ఒక వ్యక్తి అవినీతి చేసి బయట తిరుగుతున్నాడు.. ఇంకో వ్యక్తి బాబాయ్‌ను చంపి తప్పించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని అన్నారని.. ఇప్పుడు వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు.. ప్రజలే అర్థం చేసుకోవాలి అని పరిటాల సునీత పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T12:38:23+05:30 IST