Home » Skill Development Case
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అక్టోబర్ 3కు వాయిదాపడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి ధర్మాసనం తొలుత విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. దీంతో కేసులు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షన్ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణను వారంపాటు వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనంలోని న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి చంద్రబాబు కేసును విచారించడానికి నిరాకరించినప్పటికీ ఏదో ఒక ధర్మాసనం ముందు ఈ రోజే (బుధవారం) విచారణకు వచ్చేలా చూడాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదాపడింది. వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది.
స్కిల్ కేసులో సీబీఐ విచారణ జరపాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ను వేరే బెంచ్కు వేయాలని సీజే బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తమలో ఒకరికి ఈ పిల్ను విచారించేందుకు అభ్యంతరం ఉందని బెంచ్ పేర్కొంది. ఈ క్రమంలోనే వేరే బెంబ్కు వేయాలని సూచించింది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతిచోటా..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. తన రిమాండ్ క్వాష్ చేయాలని కోర్టులో దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్పై ..
చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సీఐడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానంద కోర్టుకు హాజరయ్యారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాదబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో రేపు(మంగళవారం) ప్రస్తావనకు రానుంది. క్వాష్ పిటీషన్పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాషన్ను కొట్టివేయడంతో టీడీపీ అధినేత లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
స్కిల్ డెవల్పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.