Home » TG Govt
‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?
ప్రజారోగ్య విభాగం మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనకు స్థానచలనం కల్పించారు. ఆయన ప్రస్తుతం అదనపు జిల్లా ప్రజారోగ్య అధికారి హోదాలో ఉన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా.. నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్నా ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవీ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంతో గత ప్రభుత్వంలా కాకుండా.. ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నాం. పలు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల అమలుకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? కేంద్ర బడ్జెట్లో ఈసారైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందా?
నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ(శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సహా కీలక ప్రాజెక్టులకు గ్రీన్చానల్ ద్వారా నిధులిచ్చి రెండేళ్లలో పూర్తిచేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
తెలంగాణ పర్యాటక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న హరిత హోటళ్లు, మరికొన్ని రిసార్టులు ప్రయివేట్పరం కానున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్న హోటళ్లు, రిసార్టుల నిర్వహణను ప్రయవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
లక్డీకాపూల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ3సీ)కు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎ్స, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత వైద్య సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (తాషా) వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా శనివారం 17 గేట్లను ఎత్తారు. 1,04,416 క్యూసెక్కులను దిగువకు వదిలారు.