Home » TG Govt
2029 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడాన్ని ఎవ్వరూ ఆపలేరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేత కష్టపడి పని చేసి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
వైద్య కళాశాలల్లో నాణ్యతపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్యతో పాటు వైద్య సౌకర్యాలను కూడా మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో భద్రతను పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.
రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి.. మాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రేషన్ కార్డులు లేకపోవడం ద్వారా కుటుంబ నిర్ధారణ కాకపోవడం..
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ముఖ్య ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 21నుంచి 27వ తేదీ వరకు జరిగే పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది.
రానున్న రోజుల్లో తెలంగాణను ‘ఫ్యూచర్ స్టేట్’గా మార్చనున్నామని, అందుకు కార్యాచరణ ప్రారంభమైందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ (రక్షణ గోడ) కూలిపోయిన ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ వాటర్ బోర్డుకు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది.
సీతారామ ప్రాజెక్టును మానసపుత్రికగా చెప్పుకొంటున్న కేటీఆర్, హరీశ్రావులు దశాబ్ద కాలంలో చుక్క నీరు కూడా అందించలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శించారు.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.