Home » Tirumala Laddu
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.
కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ..
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, తిరుమల వెంకటేశ్వరస్వామికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో అన్నదానం ప్రారంభమైందని గుర్తుచేశారు.ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నిత్యం మూడు లక్షల మందికి అన్నదానం చేస్తున్నామని వివరించారు. తిరుమల గిరుల్లో గోవింద నామాలే వినిపించాలని అధికారులకు స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది. ఏఆర్ డెయిరీ రెండు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఆధారాలను సేకరించింది. ఈ డెయిరీల దగ్గర కొనుగోలు..
వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి సైతం అనేక తప్పులు చేశారని మంత్రి మండిపడ్డారు.
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అందుకోసం శుక్రవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు బయలుదేరారు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలుగ చేసే చర్యలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.