Home » Tirupathi News
సికింద్రాబాద్(Secunderabad) - తిరుపతి(Tirupati) మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express) ప్రారంభమై నేటికి ఏడాదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమలకు(Tirumala) వెళ్లే భక్తుల పాలిట ఇదొక వరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రారంభ రైలుకు గతేడాది ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) జెండా ఊపగా, ఏప్రిల్ 10నుంచి పూర్తిస్థాయిలో ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్లు ప్రయాణికులకు..
AP Elections 2024: చంద్రగిరి నియోజకవర్గంలో(Chandragiri) అధికార వైసీపీకి(YCP) బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల తరబడి ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు.. టీడీపీలో(TDP) చేరారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని(Nani) ఆధ్వర్యంలో.. చంద్రబాబు(Chandrababu) సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
హమ్మయ్యా.. అలక తీరింది.. వివాదం సమసిపోయింది. ఇన్ని రోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు నేడు ఏకమయ్యారు. తిరుపతి టీడీపీ ఇన్చార్జి సుగుణమ్మతో ఆమె నివాసంలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు భేటీ అయ్యారు. దీంతో వివాదం సమసినట్టైంది. శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు దిశా నిర్దేశంతో భేటీకి ప్రాధాన్యమిచ్చారు.
ఎన్నికల ముంగిట వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తిరుపతి విమానాశ్రయ సమీపంలోని ప్రైవేట్ గోదాముల్లో పెద్దఎత్తున కానుకలు, ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారు.
మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తుందని బీజేపీ తిరుపతి లోక్సభ అభ్యర్థి డా. వి. వరప్రసాద్రావు(Varaprasad) అన్నారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున తనకు అవకాశం కల్పించినందుకు కేంద్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి తరపున అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. అత్యధిక మెజార్టీతో కూటమి తరఫున గెలుపొందుతానని అన్నారు.
వైసీపీ(YSRCP) ట్రాప్లో పడి జనసేన(Janasena)కు నష్టం చేసే పనులు చేయొద్దని పార్టీ నేతలకు జనసేన నేత నాగబాబు(Nagababu) హెచ్చరించారు. గురువారం నాడు తాడేపల్లిలోని జనసేన కార్యాలయంలో తిరుపతి జనసేన నేతలతో నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు జనసేన నేతలతో నాగబాబు ఈ ఎన్నికల్లో కీలక విషయాలపై చర్చించారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. పిల్లలకు పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) గణనీయంగా తగ్గిపోయింది. నిన్నటి నుంచి భక్తులకు వేచి ఉండే అవకాశం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.
Nara Devansh Birthday: నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కుటుంబ సమేతంగా తిరుపతికి(Tirupati) రానున్నారు. శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం నాడు లోకేష్-బ్రాహ్మణి(Lokesh-Brahmani) దంపతుల తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నారా ఫ్యామిలీ మొత్తం తిరుమలకు రానున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇవాళ సాయంత్రం తిరుమలకు చేరుకోనుండగా..
కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశుడి వద్ద లెక్కలేనంత బంగారు రాశులు, ధన రాశులు ఉన్నాయి. అందుకే ఆయన్ను అత్యంత సంపన్న దేవుడుగా భక్తులు కొలుస్తారు. వజ్ర, వైఢూర్యాలతో నిండు అలంకరణతో సుందరరూపుడై భక్తులకు దర్శనిస్తుంటాడు శ్రీవారు. అలాంటి శ్రీవారి సన్నిధిలో ఒంటినిండా దగదగ మెరిసే బంగారు నగలు ధరించి.. అందరినీ విస్తుపోయేలా చేశాడు ఓ భక్తుడు.
తిరుపతి : తిరుపతి అసెంబ్లీ సీటుపై లోకల్, నాన్ లోకల్ వార్ నెలకొంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన కీలక నేతలు అత్యవసర భేటీ అయ్యారు.