Home » Uravakonda
ప్రపంచాన్ని పీడీస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ అన్నారు. పట్టణంలో మేజరు పంచాయతీ కార్యాలయం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలల ఆధ్వర్యంలో వేర్వేరుగా స్వచ్ఛంధ్రా, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఆలస్యానికి మారుపేరుగా మారిన ఆర్టీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. డొక్కు బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియక విద్యార్థులు నిత్యం భయాందోళనలతో ప్రయాణం చేస్తున్నారు.
కందుల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు మధుసూధన, రంగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన కందులను సోమవారం వారు పరిశీలించారు.
దుకాణాల్లో అవసరమైన బ్రాండ్లు లేవని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా డిస్ప్లేలో ఉన్న బ్రాండ్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. బీర్లు అసలే లేవని దుకాణాల్లో పని చేసే సిబ్బంది సమాధానమిస్తున్నారు.
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజక వర్గాల్లోని ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కొన్నేళ్లుగా నెలకొన్న ప్రయాణ కష్టాలు త్వరలో తీర నున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రోడ్లన్నీ చాలా అధ్వానస్థితికి చేరుకుని ప్రజ లు చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో హెచ్చెల్సీపై కణేకల్లు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది.
మండలంలోని బూదగవి జిల్లా పరిషత ఉన్నతపాఠశాలకు చెం దిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలకు ఎం పికైనట్లు ప్రధానోపాధ్యా యు డు విజయ్భాస్కర్, పీడీ ప్రవీణ్బాబు తెలిపారు. గత నెలల్లో జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడి 13ఏళ్లు అవుతున్నా నేటికీ అవసరమైన భవనాలు, ఇతర వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు, గెస్ట్ ప్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. నేటికీ రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు అనుమతులు లేవు. ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభకనబరుస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు దృష్టి సారించడంతో విఫలమవుతున్నారు.
సీజనల్ వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో పారిశుధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో ప్రభాకరరావు తెలిపారు. పట్టణంలోని రంగావీధిలో పారిశుద్య పనులను ఆయన పరిశీలించారు. డ్రైనేజీలు శుభ్రం చేయించారు.
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.