Home » Venkaiah Naidu
రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రామోజీ రావు వ్యక్తి కాదని, శక్తివంతమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. జీవితంలో స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించి మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని... ఆయన చేతలు, రాతలు, చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని భావిస్తున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Andhrapradesh: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా..
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కనకమేడల ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారన్నారు.
ఆరోగ్య సంరక్షణా సౌధానికి నైతిక విలువలే పునాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం నాడు ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.
మహిళలు రాజకీయాల్లో కూడా రాణించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మహిళలు ముందుకొస్తారని.. పురుషులు వెనక్కి వెళ్తారని చెప్పారు.
Andhrapradesh: బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మాజీ ఉప రాష్ట్రపతి, సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారని కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కొనియాడారు. భావి తరాలకు ఉన్నత విలువలు అందించేందుకు కృషి చేశారని వివరించారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి(Venkaiah Naidu)ని ఆయన నివాసంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్(Jagdeep Dhankhar) మర్యాద పూర్వకంగా కలిశారు.