Home » Weather
Heavy Rain in Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో(Telangana Capital Hyderabad) వాతావరణం(Weather) ఒక్కసారిగా మారింది. ఇప్పటి వరకు ఎండ దంచికొట్టగా.. ఇప్పుడు వాతావరణం చల్లబడింది. మేఘావృతమైన వర్ష సూచన(Rain Alert to Hyderabad) కనిపిస్తోంది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి.
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజులు ముందే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి.
కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం, కోస్తాంధ్రల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించడంతో రుతుపవనాలకు అనుకూలమైన వాతావరణం కొనసాగుతోంది.
ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ముంగేశ్పుర్లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఉష్ణోగ్రతలు(Delhi Temperatures) చూపించే సెన్సార్ సరిగా పని చేయకపోవంతోనే అధిక టెంపరేచర్ చూపించడానికి కారణమని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగ భగలు కొనసాగుతోన్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో శనివారం (ఈ రోజు) నుంచి మూడు రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
భానుడు వేడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
Monsoon Updates: రుతుపవనాలు(Monsoon) కాలానుగుణంగా ఏర్పడుతాయి. మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పే రుతుపవనాలు.
ఏటా ఆలస్యంగా పలకరించే నైరుతి రుతుపవనాలు(Monsoon Season).. ఈ ఏడాది త్వరగా వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పలకరించే రుతుపవనాలు.. గురువారం కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు.
దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత బాగా పెరిగింది. ఆ నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎ్సఈ) అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆ నగరాల్లో రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడలేని పరిస్థితి నెలకొంది.