Home » Weather
ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని, నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ అధికారి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(rains) కురుస్తాయని, మరోవైపు ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది, ఎక్కడ ఎండల తీవ్రత ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు(rains) సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) నికోబార్ దీవులకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ మార్పుతో(Climate Change) పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ది లాన్సెట్ జర్నల్(The Lancet Journal) నివేదిక ప్రచురించింది. మైగ్రేన్, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని తేలింది.
Weather Alert to AP and TS: ఎండలతో సతమతం అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరణుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాడు. ఒక్కసారిగా కురుస్తు్న్న భారీ వర్షాలతో కాస్త చల్లబడుతున్నారు. అయితే, వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.
హైదరాబాద్(Hyderabad)లో 6 గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, గుజరాత్ మధ్య ఈ రోజు కీలక మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే.
Hyderabad Rains: ఒక రోజు వర్షం.. రెండు రోజులు ఎండ.. మరో రెండు రోజులు ఉక్కపోత.. ఆపై మళ్లీ వర్షం.. ఇదీ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొన్న వాతావరణ పరిస్థితి. గతం వారం రోజులుగా వర్షం, ఎండ, ఉక్కపోత గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరమంతా చల్లటి వాతావరణం నెలకొంది.
దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయి. భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అంచనాల
దక్షిణ కర్ణాటక పరిసరాల్లో ఆవర్తనం ఆవరించింది. దాని నుంచి మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఆదివారం పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.