Home » YV Subbareddy
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి.. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు.
తిరుమల లడ్డూ వివాదంపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. లడ్డూ కల్తీకి కారణమైన దోషులను రక్షించాలని తాము చెప్పడం లేదని.. . తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో నిజాలు బయటకు రావాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
విజిలెన్స్ విచారణను ఆపేయాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వ్యాజ్యం దాఖలు చేశారు. తన హయాంలో ఎలాంటి తప్పులు చేయకపోతే సుబ్బారెడ్డి విచారణ వద్దని..
వైసీపీ హయాంలో టీటీడీ పాలకవర్గంలో పని చేసిన ఆ పార్టీ నేతలపై హిందూ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ విషయంలో తమ మనోభావాలతో ఆటలాడుకున్నారంటూ టీటీడీ ఛైర్మన్ మాజీ వై.వి.సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై గుంటూరు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల నెయ్యి వాడారని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఆ నివేదికతో వైసీపీ నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఏపీ సర్కార్కు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు.
Andhrapradesh: తిరుమల లడ్డు తయారీకి జంతువుల కొవ్వు వాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..
బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.