Home » YV Subbareddy
వైసీపీలో కీలక నేతగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తిరిగి ఆ పదవి వరిస్తుందా లేదా? ఇది ప్రకాశం జిల్లాలో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో చర్చనీయాశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగిన వైవీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో పలువురు వైసీపీ నాయకులు సీఎం జగన్ను కలిసి టీటీడీ చైర్మన్ పదవికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సెలవుల రోజుల్లో, పండగ సమయాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో అక్కడ వసతి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ వసతి సమస్యను తీర్చేందుకు టీటీడీ ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ ఆగస్టుతో ముగుస్తుండటంతో ఆ స్థానంలో వైసీపీలోని బీసీ నేతను కూర్చోబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామం హర్షించదగ్గదే అయినా దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది. జగన్ ఎంతగానో నమ్ముతున్న ఐ-ప్యాక్ టీం సూచనతోనే ఈ యోచనలో పడినట్లు సమాచారం. సొంత సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టారనే విమర్శలను మూటగట్టుకున్న క్రమంలో టీటీడీ చైర్మన్ పదవిని బీసీలకు ఇచ్చామని ఎన్నికల ముందు కలరింగ్ ఇచ్చుకునేందుకే వైసీపీ సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.
శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టుకొచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతని పాటిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని... మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాళణ చేపట్టామని తెలిపారు.
తిరుమల నడకమార్గంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ స్పందించారు. శుక్రవారం ఉదయం చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.
శ్రీవాణి ట్రస్టుపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టుపై ప్రజలకే అనుమానం ఉంది. ట్రస్టుపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారా..? టీటీడీ.. వై.వి.సుబ్బారెడ్డికి సొంత సంస్థ కాదు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఏమవుతున్నాయి..? ట్రస్టు నిధులతో ఎన్ని ఆలయాలు నిర్మించారు. ఛారిటబుల్ ట్రస్టు అంటేనే పూర్తి ఉచితం.. ఒక్కొక్క భక్తుని నుంచి
ఏడుకొండల స్వామి వారికి ద్రోహం తలపెట్టిన వారు బతికి బట్ట కట్టలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్నారాయణమూర్తి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్వామికి అపచారం జరిగితే ఊరుకోమని...అవసరం అయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.