Tirumala : జూలై నెలలో టీటీడీకి ఎంత ఆదాయం లభించిందంటే..

ABN , First Publish Date - 2023-08-04T11:08:18+05:30 IST

ఆగష్టు 12వ తేదీన శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాకు జూలై నెలకు సంబంధించిన వివరాలు దెల్లడించారు. జూలై నెలలో తలనీలాలు విక్రయం ద్వారా తిరుమలకు రూ.104 కోట్ల ఆదాయం లభించిందన్నారు.

Tirumala : జూలై నెలలో టీటీడీకి ఎంత ఆదాయం లభించిందంటే..

తిరుమల : ఆగష్టు 12వ తేదీన శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాకు జూలై నెలకు సంబంధించిన వివరాలు దెల్లడించారు. జూలై నెలలో తలనీలాలు విక్రయం ద్వారా తిరుమలకు రూ.104 కోట్ల ఆదాయం లభించిందన్నారు. శ్రీవారిని 23 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని ధర్మారెడ్డి తెలిపారు. ఇక హుండీ ద్వారా 129.08 కోట్ల ఆదాయం లభించిందన్నారు. కోటి 10 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామన్నారు. 56.68 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. 9.74 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతు పనులను చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-08-04T11:08:18+05:30 IST