AP News: సీఎం జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ.. ముఖ్య పదవిపై చర్చలు

ABN , First Publish Date - 2023-07-27T17:48:00+05:30 IST

భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

AP News: సీఎం జగన్‌తో ఎమ్మెల్యే భూమన భేటీ.. ముఖ్య పదవిపై చర్చలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (CM jagan) తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో భూమన భేటీ అయ్యారు. వచ్చే నెల 12తో టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఎమ్మెల్యే భూమన ఉన్నారు. భూమన కరుణాకర రెడ్డి టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయట్లేదని ఇప్పటికే భూమన స్పష్టం చేశారు. తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని సీఎంను భూమన కోరినట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ఛైర్మన్ సహా పాలక మండలి సభ్యుల నియామకాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

lale.jpg

Updated Date - 2023-07-27T17:49:32+05:30 IST