Dhulipalla Narendra: నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు

ABN , First Publish Date - 2023-09-10T20:59:49+05:30 IST

ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికారమదం... అహంకారంతో పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదేనని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) అన్నారు.

Dhulipalla Narendra: నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు

అమరావతి: ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికారమదం... అహంకారంతో పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదేనని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) అన్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘పాలకుడు అవినీతిపరుడైతే నీతిమంతులు జైలు పాలవుతారు అనడానికి చంద్రబాబు (Chandrababu) రిమాండే నిదర్శనం.నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. అధర్మం గెలిస్తే, ధర్మం ఓడింది. కోడికత్తి కేసు, సీబీఐ.. ఈడీ కేసుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan reddy) రొమ్ము విరిచి నిలబడలేదేం సజ్జలా? కేసుల విచారణకు హాజరుకాకుండా తప్పుడు ఛార్జ్‌షీట్లు వేస్తూ జగన్‌రెడ్డి ఎందుకు తప్పించుకుంటున్నాడు? పోలీసులను దారుణంగా ధూషించిన మంత్రులు, వైసీపీ నేతల సజ్జలకు గుర్తులేరా? వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే పనిచేసే పోలీసు అధికారులపై టీడీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదే.చంద్రబాబుపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడుతూ, లోకేశ్ నేత్రత్వంలో న్యాయపోరాటం చేసి, మన నాయకుడిని ప్రజాక్షేత్రంలో గెలిపిద్దాం.తెలుగుజాతి ఔన్నత్యం, తెలుగువారి కీర్తి ప్రతిష్టల కోసం పనిచేసే చంద్రబాబునాయుడే ఎప్పటికైనా విజయం సాధిస్తారు’’ అని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

Updated Date - 2023-09-10T20:59:56+05:30 IST