Janasena: టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన మద్దతు

ABN , First Publish Date - 2023-09-10T21:39:21+05:30 IST

తెలుగుదేశం(Telugudesham) పార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన(Janasena) మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు.

Janasena: టీడీపీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన మద్దతు

అమరావతి: తెలుగుదేశం(Telugudesham) పార్టీ రాష్ట్ర బంద్ పిలుపునకు జనసేన(Janasena) మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆదివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటిస్తోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఈ అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోంది. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో వైసీపీ ప్రభుత్వం కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోంది. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ నిరసిస్తుంది. రేపు జరగబోయే బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలి’’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-10T21:39:21+05:30 IST