Share News

Tulasi Reddy వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-10-22T14:24:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వమని PCC మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ( Tulasi Reddy ) అన్నారు.

Tulasi Reddy వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వం

కడప: వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వమని PCC మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ( Tulasi Reddy ) అన్నారు. ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కరెంటు చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ప్రభుత్వానిది ఒక వైపు కరెంటు కోతలు... మరొక వైపు కరెంటు బిల్లుల వాతలు అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో 8 సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి. అదనపు భారం దాదాపు రు 50,000 కోట్లు ఉంటుందన్నారు. అసలు కంటే కొసరు ఎక్కువ అని ఎద్దేవ చేశారు. బాదుడు రెడ్డిగా జగన్‌రెడ్డి తన పేరు మార్చుకుంటే సరిపోతుందని సెటైర్లు వేశారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు రివర్స్ షాక్ ఇవ్వక తప్పదని తులసిరెడ్డి దెప్పిపొడిశారు.

Updated Date - 2023-10-22T19:26:43+05:30 IST