Share News

Kodali Nani: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని సెటైర్లు

ABN , First Publish Date - 2023-10-25T11:06:52+05:30 IST

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్నారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు.

Kodali Nani: నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై నాని సెటైర్లు

విజయవాడ : నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్నారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ. 2 వేల కోట్లు దాటిందని కొడాలి నాని అన్నారు.

40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్ల ఫీజులు ఏ విధంగా కట్టారని కొడాలి నాని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెరవనుక నుంచి టీడీపీకి మద్దతుగా ఉన్నాడని.. అయితే ఇప్పుడు ముసుగు తొలగింది అంతేనని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జనసున్నా పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడని కొడాలి నాని విమర్శించారు.

Updated Date - 2023-10-25T11:07:13+05:30 IST