Share News

Rahul Gandhi : ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ అత్యవసర భేటీ ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-11-17T15:53:04+05:30 IST

ఏపీ కాంగ్రెస్ నేతల ( AP Congress Leaders ) తో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గన్నవరం ఎయి‌ర్‌పోర్ట్‌ ( Gannavaram Airport ) లో రాహుల్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, JD శీలం, మస్తాన్ వలీ కలిశారు.

Rahul Gandhi : ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ అత్యవసర భేటీ ఏమన్నారంటే..?

అమరావతి: ఏపీ కాంగ్రెస్ నేతల ( AP Congress Leaders ) తో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గన్నవరం ఎయి‌ర్‌పోర్ట్‌ ( Gannavaram Airport ) లో రాహుల్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, JD శీలం, మస్తాన్ వలీ కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు వెళ్లేందుకు రాజస్థాన్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయి‌ర్‌పోర్ట్‌కు రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీతో పాటు KK వేణుగోపాల్ ఉన్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ఎయి‌ర్‌పోర్ట్‌ ( AIR PORT )లో మరో హెలికాప్టర్‌లోకి మారారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో మనం అధికారంలోకి వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ ఆదరణ లభిస్తోంది. రాహుల్‌కు స్వాగతం పలికి ఆంధ్ర కాంగ్రెస్ నేతలు కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ జోోష్‌ బాగుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని, సంస్థాగతంగా బలపడాలని నేతలకు రాహుల్ గాంధీ సూచించారు.

Updated Date - 2023-11-17T16:04:54+05:30 IST