Kotamreddy Sridhar Reddy : చంద్రబాబు సీఎం కావాలని కోరుకుని 24 కేజీల రొట్టెను పట్టుకున్న కోటంరెడ్డి

ABN , First Publish Date - 2023-08-01T13:14:23+05:30 IST

బారాషాహిద్ దర్గాలో కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 24 కోరికలు తీరాలని, చంద్రబాబు సీఎం కావాలని, తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 24 కేజిల రొట్టెని ఆయన పట్టుకున్నారు.

Kotamreddy Sridhar Reddy : చంద్రబాబు సీఎం కావాలని కోరుకుని 24 కేజీల రొట్టెను పట్టుకున్న కోటంరెడ్డి

నెల్లూరు : బారాషాహిద్ దర్గాలో కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 24 కోరికలు తీరాలని, చంద్రబాబు సీఎం కావాలని, తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుని ప్రత్యేకంగా తయారు చేసిన 24 కేజిల రొట్టెని ఆయన పట్టుకున్నారు. కులాలు, మతాలకి సంబంధం లేకుండా జరుపుకునే పండుగే భారషాహిద్ రొట్టెల పండుగ అని తెలిపారు. 15 ఏళ్లుగా ధర్గాతో నాకు అనుబంధం కొనసాగుతోందని కోటంరెడ్డి అన్నారు. ప్రతిపక్ష, అధికార పార్టీ ఎమ్మెల్యేగా తొమ్మిదేళ్లు దర్గా అభివృద్ధికి కృషి చేశానని.. రూ.15కోట్లు నిధులు మంజూరు చేయించానని తెలిపారు.

రొట్టెల పండుగ గురించి అనం వివేకా కృషి అనిర్వచనీయమని కోటంరెడ్డి తెలిపారు. కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు, మంత్రిగా పొంగురు నారాయణ, మేయర్‌గా అజిజ్ కృషి మరువలేనిదన్నారు. దర్గాలో బిల్లులు రాలేదని పనులు ఆపేసి ఉన్నారన్నారు. నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాలని ఆదాలని అభ్యర్ధిస్తున్నానన్నారు. దర్గా ఆర్చీలు నుడా నిధులతో జరుగుతున్న పనులు పూర్తి చేయించాలన్నారు. దర్గాలో చాలా ముఖ్యమైన మసీద్ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటున్నానన్నారు. బారాషహిద్ దర్గాలో పని చేస్తున్న ముస్లిం మతపెద్దల మనోభావాలను సైతం గుర్తించాలని కోటంరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-08-01T13:14:23+05:30 IST