Share News

Lokesh: విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: నారా లోకేష్

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:06 PM

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం విశాఖలో పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న జగన్..

Lokesh: విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు: నారా లోకేష్

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి (TDP National General Secretary) నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తీవ్రస్థాయిలో ఫైర్ (Fire) అయ్యారు. ఆదివారం విశాఖ (Visakha)లో పాదయాత్ర (Padayatra) చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న జగన్.. విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయిందని అన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భవనాలు శిథిలం చేశారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను హింస పెట్టారని, రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఇన్ని చేసినా ప్రజా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయారని అన్నారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుందని, రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందన్నారు. ‘జై అమరావతి..జై ఆంధ్రప్రదేశ్’ అంటూ నారా లోకేష్ నినాదాలు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 12:06 PM