వ్యభిచారం చేస్తోందని తెలిసి కూడా ప్రేమించాడు.. 29 ఏళ్ల వయసులో 38 ఏళ్ల ఆమెతో పెళ్లి.. కానీ ఇలా అవుద్దని అస్సలు ఊహించి ఉండడు..!

ABN , First Publish Date - 2023-04-05T18:08:15+05:30 IST

ఢిల్లీ ఘోరం కంటే దారుణంగా జరిగింది. అక్కడ ప్రియుడైతే.. ఇక్కడ మాత్రం ప్రియురాలు. కాకపోతే

వ్యభిచారం చేస్తోందని తెలిసి కూడా ప్రేమించాడు.. 29 ఏళ్ల వయసులో 38 ఏళ్ల ఆమెతో పెళ్లి.. కానీ ఇలా అవుద్దని అస్సలు ఊహించి ఉండడు..!
boyfriend

రోజురోజుకు క్రైమ్ తీవ్రత పెరుగుతోంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. కోపంతో అలా చేస్తున్నారా? లేదంటే వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు గానీ.. ఈ సంఘటన మాత్రం ఢిల్లీ ఘోరం కంటే దారుణంగా జరిగింది. అక్కడ ప్రియుడైతే.. ఇక్కడ మాత్రం ప్రియురాలు. కాకపోతే సీన్ మాత్రం సేమ్ టు సేమ్. అసలు ఇంతకీ ఏమైందనే కదా మీడౌట్. అయితే ఈ వార్త చదవాల్సిందే.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య ఘటన గుర్తుందా? దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ప్రియుడు అఫ్తాబ్.. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. అప్పుడప్పుడు శరీర భాగాలు బ్యాగులో తీసుకెళ్లి అడవిలో పడేశాడు. గతేడాది మేలో జరిగితే.. ఆరు నెలల అనంతరం వెలుగులోకి రావడంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. సేమ్ అదే తరహాలో తమిళనాడు (Tamil Nadu)పుడుక్కొట్టాయ్‌లో చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ ప్రియురాలే ఆ దుర్మార్గానికి పాల్పడడం విశేషం.

జయంత్ అనే యువకుడు చెన్నై విమానాశ్రయం (Chennai Airport) లో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లి చేసుకుని విడిపోయిన భాగ్యలక్ష్మి అనే ఓ సెక్స్ వర్కర్‌ను 2020 మే నెలలో జయంతన్.. ఆమెను ఓ లాడ్జిలో కలిశాడు. అనంతరం ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. అలా కొనసాగుతుండగా ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆమెను గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కట్టాడు. అటు తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారు.

అయితే జయంతన్ మార్చి 18న తన సొంతూరు విల్లుపురం వెళ్తున్నానని సోదరికి ఫోన్‌లో తెలియజేశాడు. కానీ రెండు రోజులైనా ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భాగ్యలక్ష్మి మార్చి 20న జయంత్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని చంపి కాళ్లు, చేతులు నరికినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ శరీర భాగాలను కోవలం బీచ్‌ తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో పాతిపెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో భాగ్యలక్ష‍్మికి మరో ముగ్గురు పురుషులు సహకరించారు. పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పుడుక్కొట్టాయ్‌లోనే ఉంటున్న భాగ్యలక్ష్మి.. జయంతన్‌ను మార్చి 19న ఇంటికి రావాలని ఆహ్వానించింది. దీంతో అతడు ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే భాగ్యలక్ష్మి.. తన స్నేహితుడు శంకర్‌కు ఫోన్ చేసి రమ్మంది. అతను మరో ఇద్దరిని వెంటపెట్టుకుని ఆమె దగ్గరకు వచ్చారు. అనంతరం నలుగురూ కలిసి మార్చి 20 తెల్లవారుజామున జయంతన్‌ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. వాటిని 400 కిలోమీటర్ల దూరంలోని కోవలం బీచ్‌కు తీసుకెళ్లి పాతిపెట్టారు. అనంతరం ఇంటికి తిరిగివెళ్లారు. అయితే ఇంట్లో ఇంకా మిగిలిన శరీర భాగాలు ఉండటంతో మార్చి 26న క్యాబ్‌ బుక్ చేసుకుని మళ్లీ కోవలం తీసుకెళ్లి పాతిపెట్టింది. అనంతరం తిరిగి పుడుక్కొట్టాయ్‌ చేరుకుంది.

ఇది కూడా చదవండి: Viral News: రైలు పట్టాల పక్కనే 70 ఏళ్ల బామ్మ.. చేతిలో ఎర్రటి వస్త్రం.. కంగారు పడుతూనే ట్రైన్ బ్రేకులు వేసిన లోకో పైలెట్.. వెళ్లి చూస్తే..

ఇది కూడా చదవండి: Restaurant Banned Smartphone: ఆ రెస్టారెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు బ్యాన్.. తినాలంటే ఫోన్‌ను పక్కన పెట్టేయాల్సిందే.. ఈ వింత రూల్ వెనుక..!

Updated Date - 2023-04-05T18:16:51+05:30 IST